Home / ANDHRAPRADESH / కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు

కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. ఇక విషయానికి వస్తే.. తుళ్లూరు మండలం అనంతవరంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే స్వామి మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఇలా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. ఇప్పటికీ టీడీపీనే అధికారంలో ఉన్నట్టు వారు అనుకుంటున్నారని, మహిళ అని కూడా చూడకుండా నన్ను కులం పేరుతో అనరాని మాటలు అన్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు అంటే టీడీపీ కి ఎప్పుడూ చిన్న చూపేనని మండిపడ్డారు. ఎమ్మెల్యేనే ఇలా అన్నారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఒక మహిళా దళిత ఎమ్మెల్యేని కంటతడి పెట్టించిన ఉసురు ఊరుకునే పోదని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat