జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నెంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్ను నిర్వహిస్తారు. కాగా గత ఏడాది నుంచి ఏటా జనవరిలో తొలి మెయిన్, ఏప్రిల్లో రెండో మెయిన్ ఎగ్జామ్ను ఎన్టీఏ నిర్వహిస్తోంది. రెండింటిలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. కాగా జేఈఈ మెయిన్ రెండో విడత రాతపరీక్షలు 2020, ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఏ తెలిపింది.
దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: సెప్టెంబర్ 30
– అడ్మిట్కార్డు డౌన్లోడింగ్: డిసెంబర్ 17 నుంచి
– పరీక్ష విధానం: ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
– పరీక్ష తేదీలు: 2020, జనవరి 6 నుంచి 11 వరకు
– ఫలితాల వెల్లడి: 2020, జనవరి 31
– వెబ్సైట్: www.nta.ac.in