టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఇటీవలే రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ లో భాగంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసాడు. ఇక ఆ ప్లేస్ అంబటి రాయుడికే అనుకున్నారు అనుకున్నారంతా. కాని ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇందులో చాలా రాజకీయం జరిగిందని సెలక్షన్ కమిటీ హెడ్ ఎంఎస్కే ప్రసాద్ కావాలనే చేసారని అన్నాడు. రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ తానూ సీఎస్కే మేనేజ్మెంట్, మాజీ క్రికెటర్ లక్ష్మన్, నోయెల్ డేవిడ్ తో టచ్ లో ఉన్నానని అన్నారు. వారి ఇచ్చిన సూచనలు, సలహాలు విన్నానని..వారు నా విషయంలో బాగా అలోచించి నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని అప్పుడే రిటైర్మెంట్ అనేది సరైన నిర్ణయం కాదని అన్నారని రాయుడు చెప్పాడు. దాంతో బాగా ఆలోచించుకున్న రాయుడు తన భవిష్యత్తు పై రీఎంట్రీ పై నిర్ణయం తీసుకోనున్నాడు.