Home / HYDERBAAD / వినాయకచవితి స్పెషల్.. గ్రేటర్ వాసులకు బంఫర్ ఆఫర్

వినాయకచవితి స్పెషల్.. గ్రేటర్ వాసులకు బంఫర్ ఆఫర్

హైదరాబాద్ అంటేనే బిజీ బిజీ లైఫ్.. కనీసం తినడానికి కూడా సమయం ఉండదు. ఇక ఫ్యామిలీతో బయటకెళ్దామనుకున్నా కానీ ఆదివారం వరకో.. ఏదో సెలవు దినం వరకు కళ్లు కాయలు కాసేదాక ఎదురుచూడాలి. ఇక పండుగలు పబ్బాలు వస్తే చెప్పనక్కర్లేదు. అయితే ఇటువంటి వారికోసమే గ్రేటర్లో పలు రెస్టారెంట్లు బంఫర్ ఆఫర్ ప్రకటించాయి. అందులో భాగంగా ప్రస్తుతం వినాయక చవితిని పురస్కరించుకుని ఫోన్ కొడితే చాలు డోర్ డెలవరి సదుపాయంతో వినాయకచవితి ప్రసాదం కిట్ పేరుతో ఈ ఆఫర్‌ను రెస్టారెంట్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఈ కిట్‌లో కేజీ ఉండ్రాళ్లు, 10 పూర్ణాలు, 10 గారెలు, హాఫ్ కేజీ పులిహోర, హాఫ్ కేజీ చక్కెర పొంగలి, హాఫ్ కేజీ రవ్వ కేసరి ఉంటాయి. ఈ మొత్తం ప్రసాదాన్ని కేవలం రూ. 470కే అందిస్తున్నారు. వినాయకచవితి ఉత్సవాలు జరుపుకునే 11 రోజులపాటు ఈ సర్వీసును అందుబాటులో ఉంచారు.నగరంలోని జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్, ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఆంధ్రా తాలింపు రెండు బ్రాంచీల్లో ప్రసాదం కిట్స్ అందజేయనున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat