స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ డీజే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో హాట్రిక్ విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది ఎందుకంటే..అల్లుఅర్జున్ కి ఆరోగ్యం సహకరించడం లేదట. వైరల్ ఫీవర్ తో భాదపడుతున్నాడట. దాంతో షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసింది చిత్ర యూనిట్.