తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు ఆస్పత్రులు ఎన్ క్వాష్ ధ్రువీకరణ పత్రాలు పొందాయి. ద్రువీకరణ పత్రాలు అందుకున్న ఆస్పత్రుల జాబితాలో ఖమ్మం,భద్రాచలం,బాన్సువాడ ఆస్పత్రులతో పాటు మొత్తం పీహెచ్సీలు ఉన్నాయి..
ఈ ఆస్పత్రులకు ఒక్కో పడకకు ఏడాదికి రూ.10వేల చొప్పున మూడేళ్ల పాటు కేంద్ర సర్కారు నిధులు ఇస్తుంది. పీహెచ్ సీలకు పడకలతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.2లక్షలు.. 24గంటల పాటు సేవలనందిస్తే ఏడాదికి 3లక్షలు ఇస్తారు. అయితే రోగులకు అందుతున్న వైద్యసేవలు.. పంపిణీ చేస్తున్న మందుల లభ్యత.. పరిశుభ్రత ఆధారంగా ఎన్ క్వాష్ ఆధారంగా ఈ సర్టిఫికెట్ ఇస్తారు.