Home / SLIDER / పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది.

యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు టీఆర్ఎస్ సర్కారుపై చౌకబారు ఆరోపణలు చేశారు. దీనికి సమాధానంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు.

ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ప్రచారం చేస్తుందని ఆయన తిప్పికొట్టారు. యూరియా కొరత రాకుండా ఉండాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గత నెల ఆగస్ట్ నెలలో కంపెనీల నుంచి 1.12లక్షల మెట్రిక్ టన్నులు..మార్క్ ఫైడ్ బఫర్ స్టాక్ నుంచి అందుబాటులోకి 1.25లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాము.బుధవారం వరకు అన్నిజిల్లాలకు 15వేల మెట్రిక్ టన్నులు చేరవేశామని ఆయన తెలిపారు. అయితే దుబ్బాక నియోజకవర్గంలో రైతు గుండెపోటుతో మరణించారు అని .. ఎరువుల కోసం క్యూలో నిలబడి కాదు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ లక్ష్మణ్ ఇజ్జతు తీశారు మంత్రి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat