కైరా అద్వాని…భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో మహేష్ సరసన నటించిన కైరా సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి ఫేమస్ అయ్యింది. అప్పట్నుండి తన ఫేట్ మొత్తం మారిపోయింది. తన నటనతో అందరిని ఆకట్టుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది. అయితే ఈ సినిమాకు రీమేక్ గా కైరా, షాహిద్ కపూర్ జంటగా కబీర్ సింగ్ తీయడం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే ఈ చిత్రం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నుండి కైరా మరింత రొమాంటిక్ గా తయారయ్యిందని ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇంస్టాగ్రామ్ లో తన పోస్టులు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుంది.