తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి బుల్లెట్ స్పీడ్ తో పరుగులెత్తి ఐదేండ్లల్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.
తెలంగాన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత ఏడేండ్లల్లోనే 126% పెరిగింది. 2011-12లో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.91,121లు ఉండగా 2018-19నాటికి రూ.2,05,696కు పెరిగిందని ఒక సర్వే తెలిపింది. ఈ సమయంలోనే భారతదేశ సగటు 2011-12లో రూ.63,462లు ఉంటే 2018-19లో కేవలం రూ.1,26,406లకు పెరిగింది.
జాతీయ స్థాయిలో 100% మాత్రమే ఉంది. తెలంగాణ అభివృద్ధి రేటు 2012-13లో 10.8% ఉంటే అది 2018-19నాటికి 13.8%కి పెరిగింది. అదే జాతీయ స్థాయిలో 2012-13లో 11.9% ఉంటే తలసరి ఆదాయం గ్రోత్ రేట్ 2018-19నాటికి 10%కి తగ్గింది. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతో తలసరి ఆదాయం పెరుగుదలో దేశానికి దిక్సూచిలా మారింది తెలంగాణ..