తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.
తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ సమాజాన్ని ఉద్ధేశించి” మీ ఇంటిలో ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. మురుగు నీళ్ళు నిల్వ లేకుండా చూసుకొండి. పూల కుండీలల్లో ,కూలర్లల్లో నీళ్లు ఎక్కువ కాలం నిల్వలేకుండా చేయండి” అని పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకంతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. వీరి జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు,రెబల్ స్టార్ ప్రభాస్ ,హీరోయిన్ సంగీత,సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లు ట్వీట్ చేస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు.