తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా పవన్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.. అయితే తాజాగా పవన్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో నవ్వు రప్పిస్తోంది..
కారణమేమిటంటే ఇటీవల ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా వరద నీరు పోటెత్తింది. అయితే ఆ సమయంలో నీటిని నిల్వ చేసుకునేందుకు కొన్ని రోజులు గేట్లు ఉంచడం తర్వాత బ్యారేజ్ నిండిన తర్వాత నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతం లోని కొన్ని గ్రామాలు కొన్ని పనులు నీటమునిగిన విషయం తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవేశంగా గతంలో వచ్చిన మొన్న వచ్చిన వరదలకు వందల మంది వేలమంది అంటూ తన గొంతు సవరించుకుని సవరించుకొని వందల మంది చనిపోయారు అని వ్యాఖ్యానించారు.. అయితే రాజధానిలో ఒక రైతు చనిపోకపోగా కేవలం కాస్త పంట నష్టం మాత్రమే జరిగింది.. దానికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందింది.. ఇకపోతే పశువులకు ఎటువంటి నష్టం కూడా జరగలేదు.. కానీ ఇది తెలియని పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని లా మాట్లాడుతున్నాడని ఒక్క ప్రాణనష్టం జరగకుండా 100 మంది చనిపోయారు అని ఎలా అంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఒక సబ్జెక్టు మాట్లాడినప్పుడు మాట్లాడేటప్పుడు మినిమం అవగాహనతో మాట్లాడాలని సూచిస్తున్నారు.