ఏపీలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్తకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. లోకాయుక్తగాగా ఎంపికైన జస్టిప్ పి. లక్ష్మణ్ రెడ్డికి పలువురు రాజకీయ, న్యాయవాద ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి నియామకం ఉపయుక్తంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.