నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు.
వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ సభ్యులు కేటరింగ్,కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం చాలా బాధాకరమని పలువురు వాపోతున్నారు.