ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు.
తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు అని సమాచారం.
కోడెల శివప్రసాదరావు తన మొబైల్ నుంచి చివరి కాల్ హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రికి చెందిన ఒక ప్రముఖ వైద్యురాలికెళ్ళిందని పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారిస్తున్నారని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తోన్నాయి.
చివరిగా కోడెల శివప్రసాదరావు ఆమెకే ఎందుకు కాల్ చేశారు. ఆమెకు చేయాల్సినవసరం ఏమోచ్చింది అని పలు అంశాలు వారిగా పోలీసులు కేసు విచారణ వేగవంతం చేస్తున్నారని కూడా ఆ వార్తల సారాంశం. చూడాలి మరి చివరికేమి తేలుతుందో..?