Home / ANDHRAPRADESH / ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!

ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 మంది సభ్యులున్న బోర్డును మేనేజ్ చేయడమే సమస్యగా ఉండేదని…ఇప్పుడు 29 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త బోర్డుతో ఛైర్మన్, ఈవో ఎలా నెగ్గుకొస్తారో అంటూ ట్వీట్ చేశారు. టీటీడీ బోర్డులో ఆధ్యాత్మిక, భక్తి భావం ఉన్నవాళ్లు ఉండాలని అనుకుంటే..అది ఏ నాడు జరగలేదని అన్నారు.. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై కూడా ఐవైఆర్ స్పందించారు. టీటీడీ బోర్డుపై తానేమంటానన్న ఆసక్తి తెలుగుతమ్ముళ్లలో నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా టీటీడీ బోర్టుపై మాజీ సీయస్ ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat