ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు.
ఆయన రెండు సార్లు(2009,2014ఎన్నికల్లో) చిత్తూరు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.