Home / SLIDER / తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు.

ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కేంద్రాన్ని కోరనున్నారు. అంతేకాకుండా జీఎస్టీ రీటర్న్ ల దాఖల ప్రక్రియను సరళీకృతం చేయాలని కూడా కేంద్రానికి సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat