విశాఖ జిల్లా అనకాపల్లి నియోజవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాద్ తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పచ్చ మీడియాపై ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, దీనికి తగ్గటుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే చూస్తూ ఉండలేక కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇకనైన ఆపుకుంటే మంచిదని అన్నారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసింది ఏముందని ప్రశ్నించారు. ఎటు చూసినా శూన్యమే కనిపిస్తుందని మేరు ప్రజలను వాడుకొని వదిలేసారు తప్ప చేసింది ఏం లేదని అన్నారు. ఈ నగరాన్ని పేకాట క్లబ్గా చేసిన గొప్పతనం మీదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు.