తెలంగాణలో అటవీ శాతాన్ని.. పచ్చదనాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం హరితహారం. ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే చర్యలను కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో విజయవంతమైన హరితహారం కార్యక్రమంపై ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర మాదిరిగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలి.
హరితహారంలో మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” అసోంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఒడ్డున 550 హెక్టార్లలో అడవిని పెంచడానికి నాకు దాదాపు ముప్పై ఏళ్లు పట్టింది. అడవులను రూపొందించడంతో ప్రస్తుతం అక్కడకి పులులు,ఏనుగులు రావడం మొదలైందని”అన్నారు.