Home / 18+ / వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. దుష్ప్రచారం చేయొద్దు

వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. దుష్ప్రచారం చేయొద్దు

టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ వేణు మాధన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.. తాజాగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గత కొనేళ్లుగా వేణు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత నాలుగైదేళ్ల నుంచి సినిమాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు.

 

కొన్నాళ్లక్రితం ఆయన ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలపై స్వయంగా స్పందించి తాను బావున్నానని ప్రకటించారు. తనపై దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటానన్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే వేణుమాధవ్ పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు సినీ ప్రముఖలు ఆస్పత్రికి వస్తున్నారు. మరోవైపు వేణుమాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat