తాజాగా ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ హత్య జరిగింది, ఒక భారతీయ మహిళ తనభర్తకు యాపిల్ లోని గింజలను పిండిచేసి అతనికి పెట్టి పేసింది. అయితే ఆమె ఆమె ప్రేమికుడు దోషులుగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఆపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందని అప్పటివరకూ ఎవరికీ తెలియదు. దీనిపై ఓ శాస్త్రవేత్త పరిశోధించగా ఆపిల్ విత్తనాలలో సైనైడ్ ఉందని తెలిసింది. కొన్ని కీటకాలు ఆపిల్ పంటను కొట్టకపోవడానికి ఇదికూడా ఒక ముఖ్య కారణం. అందుకే ఎవరూ ఆపిల్ విత్తనాలు తినవద్దు.
ఆపిల్ తినడానికి ముందు విత్తనాలు తొలగించకోవాలి.. పిల్లలకు మొత్తం ఆపిల్ ఇవ్వకూడదు. ఇచ్చే ముందు విత్తనాలు తొలగించాలి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే నెట్ లో కూడా వెతకవచ్చు. విత్తనాలు దెబ్బతిన్నప్పుడు, నమిలినప్పుడు లేదా జీర్ణమైనప్పుడు, ఆ విత్తన గింజలో ఉండే అమిగ్డాలిన్ అనే మొక్కల సమ్మేళనం హైడ్రోజన్ సైనైడ్ గా క్షీణిస్తుందని, ఇది అత్యంత విషపూరితమైన మరియు ప్రాణాంతకమైనది ఓ శాస్త్రవేత్త వెల్లడించారు.