తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికై పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. గత ఆరేళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గడపకు చేరుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు తగ్గట్లు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెడతామని “అన్నారు. నీరా స్టాల్ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి గౌడ జాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.