ఉత్తర భారతంలో కాషాయనాథులు కామాంధుల్లా రెచ్చిపోతున్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉన్నావోలో 18 ఏళ్ల ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాధిత యువతి ఏకంగా సీఎం ఆదిత్యనాథ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగినా ఫలితం లేకపోయింది. పైగా ఎమ్మెల్యేకు వత్తాసు పలికిన పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు బాధిత యువతపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆమె తండ్రి పోలీస్ లాకప్లో చనిపోయారు. ఆమె కారును లారీతో గుద్దించగా..చావు బతుకుల్లో మధ్య కొట్టుమిట్టాడింది. ఏడాది దాటినా ఈ కేసులో బాధిత యువతికి న్యాయం జరుగలేదంటే.. బీజేపీ పెద్దలు ఏ మేరకు తమ ఎమ్మెల్యేను వెనకేసుకువస్తున్నారో అర్థమవుతుంది. ఉన్నావో అత్యాచార ఘటన మరువకముందే మరో బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటన గోవాలో చోటు చేసుకుంది.
తాజాగా పనాజీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోన్సర్రేట్ ఓపదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. ఎమ్మెల్యే బాలికను బలవంతంగా లాక్కెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఉన్నావ్ తరహాలోనే పనాజీలో కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాలిక తల్లిదండ్రులు గోవా కోర్ట్ను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్దారించిన గోవా కోర్టు.. బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పై ఐపీసీ 376 – 506 – పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేందుకు సమయాత్తం అయ్యారు. ఇక బేటీ బచావో..బేటీ పడావో అని బాలికలను కాపాడుకుందాం..వారిని చదివించుకుందాం అని గొప్పగా చెప్పుకునే మోదీ సర్కార్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా బాలికలపై అత్యాచారాలు చేస్తుంటే…చోద్యం చూడడం దారుణం. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు శిక్ష పడకుండా వారికి వత్తాసు పలకడం అత్యంత నీచాతినీచం. మొత్తంగా మోదీ సర్కార్లో కాషాయనాథులు కామాంధుల్లా మారి మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, భౌతిక దాడులకు పాల్పడడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సి న విషయం.