Home / ANDHRAPRADESH / శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే ఐదు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే 1982 సంవత్సరం తర్వాత ఒకే సీజన్లో నాలుగు సార్లు గేట్లు ఎత్తి వరద నీరు కిందకి పంపించడం విశేషం.

అలాగే బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి పోత్తిపోతల పథకానికి 1,848 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయ పరిసర ప్రాంతాలలో 5.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కుడిగట్టు కేంద్రంలో 12.971 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 19.721 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. డ్యాంలో 210.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat