ఉత్తరాదిన బీజేపీ ఎమ్మెల్యేలు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తుపాకీలతో హల్చల్ చేయడం, తమను ఎదిరించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం..తాగి, అమ్మాయిలతో చిందులు వేయడం బీజేపీ ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్గా చుక్కేసి బార్ డ్యాన్సర్తో చిందేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పురమ్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని బార్ డ్యాన్సర్తో రచ్చరచ్చ చేశాడు. మందేసి ఆమెపై డబ్బు నోట్లు విసురుతూ చిందేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పురమ్ గాంధీ జల్లాలోని ఆమ్గోన్-డోరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈయనగారు పబ్లిక్గా మందేసి డ్యాన్సర్తో చిందులేసిన వీడియో వైరల్ కావడంతో గత కొద్ది రోజులుగా మాయమయ్యాడు. పోలీసులు సంజయ్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Wowwww wht a govT bjP vidhansabha …aamdar devri-amgaon sanjay puram @Dev_Fadnavis @PMOIndia @nitin_gadkari @BJP4India pic.twitter.com/kwYgYCBr5j
— Aniket (@jainaniket953) September 27, 2019