Home / MOVIES / అభిమానులకు చెర్రీ క్షమాపణలు

అభిమానులకు చెర్రీ క్షమాపణలు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్రం యూనిట్ బిజీ బిజీగా ఉంది.

అందులో భాగంగా ఇటీవల బెంగళూర్ లో సైరా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా హీరో హీరోయిన్లు చిరంజీవి,తమన్నా ,నిర్మాత రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఈ వేడుకను చూడటానికి అభిమానులు ఎక్కువగా రావడంతో హాల్ సరిపోకపోవడంతో చాలా మంది బయటనే ఉన్నారు.

దీనిపై తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ “బెంగళూర్ లో జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకకు భారీ స్పందన వచ్చింది. హాలులోకి రాలేకపోయిన అభిమానులందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీరందించే ప్రేమ మాకు మరింత ఎనర్జీను ఇస్తుందని.. సైరా విడుదలను ఎంజాయ్ చేయాలని “ఒక పోస్టును పోస్టు చేశాడు చెర్రీ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat