తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నిక జరగనున్న సంగతి విధితమే. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా ఉన్న వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు వేసింది. దీంతో వెంకటేశ్వర్లను హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులను జారీచేసింది. ఇతని స్థానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన భూపాల పల్లి ఎస్పీగా ఉన్న ఆర్ భాస్కరన్ ను ఎస్పీగా నియమించింది.