తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడటం అంటే దాని అర్థం లోకేష్ ను తొలగించడం అని స్పష్టమవుతోంది. కనీసం తన సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం నిజంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే మాట్లాడకుండా తండ్రిని అదే మాజీ ముఖ్యమంత్రి పంపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.