Home / ANDHRAPRADESH / మాట ఇస్తే మడంతప్పని వ్యక్తి జగన్..మరో అడుగు ముందుకు !

మాట ఇస్తే మడంతప్పని వ్యక్తి జగన్..మరో అడుగు ముందుకు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. బతుకుతెరువు కోసం వాహన దారులు అష్టకష్టాలు పడుతుంటారు. రికార్డులు లేకపోవడం, ట్యాక్స్ చెల్లించలేక ఇలా వారిపై ఎన్నో మానసిక వత్తుడులు ఉంటాయి. నెల పూర్తయితే చాలు ఎక్కడలేని భయం వారికి వస్తుంది.నెల మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకునే వీళ్ళు చివర్లో ఫైనాన్షియర్లు, ఇన్సూరెన్స్, మరమ్మత్తులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక పక్క కుటుంబానికి మరో పక్క ఈ ఖర్చులు. నెలాకరు వస్తే అన్ని సమస్యలే. ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ నాయకుడు వీరిని పట్టించుకోలేదు. కాని ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు చెయ్యని పని నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసాడు. వారి పాలిట దేవుడయ్యాడు. జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో మీ అందరికి నేనున్నానంటూ హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పాడు. అందుకు తగ్గుట్టుగా ఆ హామీని అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రం మొత్తం 73వేల మందికి లబ్దిదారులకు రూ.400 కోట్లతో లబ్ది చేకూరుతుంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat