వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ప్రతీరోజు ప్రజల శ్రేయస్సు కొరకు పోరాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకై కృషి చేస్తున్నారు. అటు ప్రజలనే కాకుండా వారిని కాపాడే పోలీసుల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరితో సూపర్ సీఎం అనిపించుకున్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.ఇక వారి వివరాల్లోకి వెళ్తే..
*నెల్లూరు క్రైమ్స్ ఏఎస్పీగా పి.మనోహర రావు.
* అడ్మిన్ ఏఎస్పీగా టి.శోభా మంజరి.
*అనంతపురం అడ్మిన్ ఏఎస్పీగా జి. రామాంజనేయులు.
*సీఐడీ ఏఎస్పీగా ఎన్. వెంకటేశ్వరరావు.
*గుంటూరు అర్బన్ క్రైమ్స్ ఏఎస్పీగా ఎం. శ్రీనివాస్.
*ప్రకాశం జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా బి.శరత్ బాబు లకు పోస్టింగ్ ఇచ్చారు.