నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఒకసారి బాబు హయాములో MRO వనజాక్షిని టీడీపీ చింతమనేని చౌదరి ఇసుకలో వేసి కొట్టిన వీడియో లు చూసాము అయినా చంద్రబాబు తప్పు ఎంఆర్వో దే అని తీర్పు ఇచ్చాడు. ఇక నా విషయానికే వస్తే..నా స్నేహితుడికి చెందిన లే అవుట్ కు మంచినీటి కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన అనుమతుల కోసం MPDO సరళ.. మూడు నెలలుగా తిప్పుతున్నారని, తాను స్వయంగా సూచించిన తరువాత కూడా నెలరోజుల పాటు జాప్యం చేశారని అన్నారు. ఇక జిల్లా ఎస్పీకి తనపై కోపం ఉందని, ఆయనతో తనకు సఖ్యత లేదని కోటంరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్పీ జిల్లాకు వచ్చారని, ఇప్పటికీ కొనసాగుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఆయనను నాటి చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు పంపించిందని అన్నారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి కీలక నాయకులు ఉన్న జిల్లాకు ఎలాంటి ఎస్పీని పంపిస్తారో తెలియనిది కాదని చెప్పారు. ఎన్నికల సమయం నుంచి తనపై ఎస్పీ ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.తన మీద ఉన్న కోపంతో జిల్లా ఎస్పీ.. తన నియోజకవర్గంలో పనిచేస్తోన్న అధికారులపై ప్రదర్శిస్తున్నారని, వారిని వేధిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్ష కోసం తనను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయనను ఇంకా బదిలీ వేటు వేయలేదని, తమ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పనిచేస్తోందో స్పష్టం చేయడానికి నెల్లూరు జిల్లా ఎస్పీ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు. తన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి భార్య స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసినప్పటికీ.. ఆయన స్పందించలేదని, అలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయని చెప్పారు.