తెలంగాణ రాష్ట్రంలోని ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న సూర్యపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో కలిసి నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం ఎల్దండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ… ఒక ఓటు మన తల రాతలు మారుస్తుంది. 2014 కు ముందు…తరువాత వేసిన ఓట్లే ఆ మార్పుకు సంకేతం, ఆ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికాయి.అంతకు ముందు వేసిన ఏ ఓటు నిరంతర నాణ్యమైన విద్యుత్ నందించ లేకపోయింది.
యావత్ భారతదేశంలోనే 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తోటే అది సాధ్యపడింది. రైతాంగాన్ని నడ్డి విరిచింది కాంగ్రెస్ పార్టీనే. వరుసగా ఎనిమిది ఏండ్లు ఎడమకాలువను ఎండబెట్టి కిందికి నీళ్లు వదులుతుంటే ఉత్తమ్ ఎందుకు అడ్డుకోలేక పోయాడని ప్రశ్నించారు.