టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో కనిపిస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పూజ ఈ చిత్రంలో పూజ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా ఉంటారని తెలుస్తుంది.ఈ చిత్రం జనవరి 12 సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.