ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన సుమారు ఇరవై ఐదు వేల మందిని తొలగించింది.
ఈ నెల ఇరవై ఏడో తారీఖున రానున్న దీపావళి పండుగకు ముందు యోగీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తోన్నాయి. యూపీ ప్రభుత్వ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం ఆ రాష్ట్ర సీఎస్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఎన్నికల ముందు యువతకు ఉపాధి కల్పిస్తాము. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా ఎన్నికల్లో గెలుపొంది.. అధికారంలోకి వచ్చాక యువతను గాలికి వదిలేస్తోన్నారని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.