ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అదికారులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. గ్రామ/వార్డు సచివాలయాల పేరిట కొత్త వ్యవస్థలని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక ఇవేగాక వైన్ షాపులని ప్రభుత్వాలు నడుపుతూ…అందులో కూడా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించారు. వీటితో పాటు నిరుద్యోగులకు మేలు కలిగేలా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని జగన్ నిర్ణయం తీసుకుని , దానిని అమలు చేస్తున్నారు.కేవలం ఈ ఉద్యోగాల విప్లవాన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి ఏడాది కొనసాగించాలని జగన్ ప్లాన్ చేశారు. అందుకే ప్రతి ఏడాది జనవరిలో ఖాళీలు ఉన్న ప్రతి పోస్టుని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. దీని ప్రకారం రాబోయే జనవరిలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇలా ఐదు నెలల్లోనే నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టిన జగన్….ఐదేళ్లలో నిరుద్యోగం మాటే లేకుండా చేస్తారనే వైసీసీ నేతలు అంటున్నారు.