ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప విషయం. పోలవరంపై ఇదే విధంగా ముందుకుపోవాలి. ముఖ్యమంత్రి జగన్ సత్తా ఉన్ననాయకుడు.
ప్రజలకు పాలన అందించడంలో విజయవంతమవుతున్నాడని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతొక్కటి నేరవేర్చి అండగా నిలబడతామని ఆయన భరోసానిచ్చారు.