తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగడం మూర్ఖత్వం. లాభాలు వచ్చే రోజుల్లో సమ్మెకు దిగడం తప్పు. ఎస్మా ఉన్నా కానీ సమ్మెకు ఎలా దిగితారు అని ప్రశ్నించారు.
ఆర్టీసీ సిబ్బంది, అధికారులు,యాజమాన్యం,డ్రైవర్లు,కండక్టర్లు మంచివాళ్లే. యూనియన్లే వాళ్లను చెడగొట్టారు. సమ్మె చేస్తూ వాళ్లు కూర్చున్న కొమ్మను వాళ్లే నరుక్కుంటున్నారు. కార్మికులు ఇప్పటికైన వచ్చి విధుల్లో చేరతామని దరఖాస్తులు చేసుకుంటే చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.