Home / NATIONAL / లక్షలు విలువ చేసే బంగారాన్ని మింగిన ఎద్దు.. పేడలో రాలేదు.. మరి ఏం జరిగిందో తెలుసా

లక్షలు విలువ చేసే బంగారాన్ని మింగిన ఎద్దు.. పేడలో రాలేదు.. మరి ఏం జరిగిందో తెలుసా

పొరపాటున చెత్తతోపాటు పడేసిన దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని ఓ ఎద్దు తినేసింది. ఇప్పుడా బంగారం యజమానులు ఆ ఎద్దు పేడ వేస్తే అందులో వెదుక్కునేందుకు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని సిర్సాకు చెందిన జనక్‌రాజ్‌ భార్య, కోడలు తమ 40 గ్రాముల బంగారం నగలను వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. గిన్నెలో చెత్త కింద తమ బంగారం ఉన్న విషయాన్ని అత్తాకోడళ్లు మర్చిపోయారు. ఆ తర్వాత చెత్తను తీసుకువెళ్లి బయటపడేయగా ఓ ఎద్దు చెత్తతోపాటు బంగారాన్ని మింగేసింది. ఆ తర్వాత నగల విషయం గుర్తుకు వచ్చిన కుటుంబ సభ్యులు సీసీ కెమెరా పుటేజీ పరిశీలించగా ఎద్దు తినేయడాన్ని గుర్తించారు. దీంతో ఆ ఎద్దును పట్టుకుని ప్రస్తుతం దాన్ని సాకుతున్నారు. ఈపూటా, ఆపూటా ఆహారం పెట్టి అది వేసే పేడలో తమ వస్తువులు పడతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఈ ఘటన జరగగా, ఇప్పటి వరకు ఎద్దు వేసిన పేడలో వారి వస్తువుల జాడ కనిపించక పోవడంతో నిరాశ చెందుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat