తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు.
టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానానికి తమ నిర్ణయం తెలిపినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడిగా అసెంబ్లీ,పార్లమెంట్ ,స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తమ్ అనుసరించిన విధానాల వలనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అని కాంగ్రెస్ పార్టీ నేతలు,ఎమ్మెల్యేలు,ఎంపీలు ఆరోపిస్తున్న సంగతి విదితమే.
తాజాగా సొంత నియోజకవర్గం అందులో సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.