దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే.
పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.
అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు స్పందించారు. వారు మాట్లాడుతూ” కేంద్రం బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహాజం. కానీ బంగారంపై పరిమితులు కానీ సరికొత్త చట్టాలు కానీ ఎలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. అవన్నీ వట్టి పుఖార్లే అని”వారు ఖండించారు.