తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య మార్గంలో .. హైదరాబాద్ నుండి నాగపూర్ మధ్య స్కైవేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి సంబంధించిన భూములు రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయి.అందుకే కంటోన్మెంట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించండి.రక్షణ శాఖ పరిధిలోని భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పండి.మెట్రో బకాయిలు రూ.254 కోట్లు విడుదల చేయాలి.
ఘన వ్యర్థాల నిర్మూలన ప్రాజెక్టుకు రూ.400 కోట్లు ఇవ్వండి “అని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి కేటీఆర్ “ఏరోస్పేస్ శిక్షణకు బేగంపేట ఎయిర్పోర్టు వినియోగానికి అనుమతించండి” అని విన్నవించారు.