Home / ANDHRAPRADESH / విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!

విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!

హర హైతో భరా హై నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఈ గ్రీన్‌ ఛాలెంజ్ ఆకర్షిస్తోంది. తాజాగా గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మొక్కలు నాటారు. తమ గురువర్యులు మహాస్వామి వారి కోరిక మేరకు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆవరణలో మూడు రుద్రాక్ష మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ఎంతొ అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో కీలక భూమిక పోషిస్తున్న కో ఫౌండర్ రాఘవ, కరణ్ కాన్సెప్ట్స్ , దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat