తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న కార్యక్రమానికి తెర తీశారు.
ఇప్పటికే ఎంపీ సంతోష్ విసిరిన ఈ సవాల్ ను పలువురు ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. వీరి జాబితాలోకి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ స్వీకరించింది. ఇందులో భాగంగా గోపిచంద్ అకాడమీలో పీవీ సింధూ మొక్కలు నాటింది. నాటిన ఫోటోలను,వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.