Home / ANDHRAPRADESH / వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?

వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క

అంతకాదు ఇంత అన్న జనసైనికులు  మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి.

*గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు ,

*దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు,

*ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు,

*అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు ,

*ఇసుక లారీ గుద్ది ఏర్పేడులో దాదాపు పది మంది అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు,

*కృష్ణ నదిలో పడవ తిరగబడి 15 మందికి పైన ప్రాణాలు కోల్పోయినప్పుడు,

*ప్రత్యేకహోదా కోసం మునిస్వామి అన్న ప్రాణత్యాగం చేసినప్పుడు,

*రాజధాని రైతులకి అన్యాయం జరిగినప్పుడు,

*ధర్మవరం చేనేతలు సంవత్సర కాలంలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు,

*అనంతపురంలో రెండు సంవత్సర కాలంలో దాదాపు 45 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు,

*విజయవాడలో జరిగిన కాల్ మణి ,సెక్స్ రాకెట్ లాంటి అన్యాయమైన కార్యక్రమాలు జరిగినప్పుడు,

*పవిత్ర కృష్ణ నది లో ఈత కి వెల్లి దాదాపుగా 10 మంది అమాయకులు ప్రాణాలు  కోల్పోయినప్పుడు,

*రాజధాని ప్రాంతంలో దాదాపుగా 30 మంది త్రాగడానికి సురక్షత మంచి నీరు కరువై డైయేరియా వచ్చి మల్లి 300 మంది కి పైన జనాలు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు,

*రైతన్న తన పంటకు గిట్టుబాటు ధర లేక నెత్తిన చెయ్యి పెట్టుకొని తల నేలకేసి చూసినప్పుడు,

*ఆశ  వర్కర్లు తమకి జీతాలు పెంచండి మాకు అన్యాయం జరుగుతోంది అని రోడ్డు ఎక్కినప్పుడు,

*ఒక మహిళా ఎమ్.ఆర్.ఓ ని జుత్తు పట్టుకోని లాక్కొని వెళ్ళినప్పుడు,

*మన ఆంధ్ర ప్రజల కడుపు కొట్టి సంపాదించిన డబ్బుతో పక్క రాష్ట్రంలో ఎం.ఎల్.ఏ లను కొంటున్నప్పుడు,

*నిరుద్యోగులకి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన లేకుండా ,కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతకు అన్యాయం చేసినప్పుడు,

*కాపు కులం సోదరులకు దొంగ హామీలు ఇచ్చి వాళ్ళను నట్టేట ముంచినప్పుడు,

*ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం,అదేమైనా సంజీవని నా అని ప్రత్యేకహోదాని అవహేళన చేసినప్పుడు

*కనీసం లోకజ్ఞానం తెలియని ఒక పనికిమాలిన వాడికి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య రంగాలు ఆతని చేతిలో పెట్టి రాష్ట్రాన్ని అవినీతి వైపు నడిపిస్తున్నప్పుడు,

*ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి అమ్ముడుపోయి మంత్రి పదవులు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని ఖూని చేసినప్పుడు,

*అధికార పార్టీ అవినీతి నాయకుల కోసం గుడిని ,గుడిలో లింగాన్ని సైతం మింగి వేస్థున్నప్పుడు,

*డ్వాక్రా అక్క,చెల్లెమ్మలు పొట్ట పట్టుకోని రోడ్డు మీదకి వచ్చినప్పుడు,

*క్వింటా మిర్చి 12,000 రూపాయిలు వుండాల్సిన ధరను 2000 రూపాయలకు రైతన్న అమ్ముకున్నప్పుడు,

*కల్తీ విత్తనాలు,కల్తీ సేద్యపు మందులు ,కల్తీ ఎరువులు  రైతన్నలకు అమ్మినప్పుడు

*గత 10 ఏళ్లుగా ఏ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోరాటం చెయ్యడం కాదు కదా కనీసం అయన పక్కన నుండి స్పందన కూడా లేదు.

*రాష్ట్రంలో వీళ్ల అందరి తరుపున ఒక్క నాయకుడు అయినా నుంచొని నేనున్నాను అని ధైర్యం చెప్పాడు అంటే అది కేవలం మా నాయకుడు జగన్ మాత్రమే..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat