బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా థ్యాంక్యూ చెబుతాడా అని ఆలోచిస్తున్నారా.?. అయితే ఇక్కడే మీరు పప్పులో కాలేశారు.
అసలు విషయం ఏమిటంటే ఒకవైపు ఢిల్లీని పొగ ,దుమ్ము ,కాలుష్యంతో సతమతవుతున్న కానీ ధైర్యంగా బంగ్లాదేశ్ జట్టు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినందుకు ఆ టీమ్ ను ఉద్ధేశించి “ఢిల్లీలో వాయు కాలుష్యమున్న కఠినమైన పరిస్థితులున్న కానీ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఇరు జట్లకు ధన్యవాదాలు అని దాదా ట్వీట్ చేశాడు.