ఇండియాన్ క్రికెట్ లో మరో అద్భుతం జరగబోతుంది. ఇదంతా గంగూలీ వల్లే సాధ్యమైంది అని చెప్పాలి. బీసీసీఐ కి నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన గంగూలీ కొద్దిరోజుల్లోనే ఇండియన్ క్రికెట్ లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టాడు. అదేమిటంటే టీమిండియా తో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు డే అండ్ నైట్ ఆడనున్నారు.భారత్ లో మొదటిసారి ఈ మ్యాచ్ ఆడనున్నారు. మరోపక్క ఈ మ్యాచ్ కు సంబంధించి భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని కామెంటేటర్ గా దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ కు భారత్ టెస్ట్ జట్టుకు ఇప్పటివరకు ఎవరైతే కెప్టెన్ లుగా వ్యవహరించారో వారందరు రావాలని ఈ మేరకు గంగూలీ వారిని ఆహ్వానించారు. మొదటి రెండురోజులు వారంద్దరు ప్రేక్షకులకు దర్శనం ఇవ్వనున్నారు.