ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి జంప్ అయ్యాడు. చినబాబు నాలుగు గంటల దీక్ష చూసి టీడీపీ కార్యకర్తలే నోరెళ్లపెట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ది మరీ ఘోరం..వైజాగ్లో లాంగ్ మార్చ్ అని బిల్డప్ ఇచ్చి కేవలం రెండంటే రెండు కి.మీ. మార్చ్ చేశాడు.. అది కూడా పవన్ నడవలేదు..కారుపై ఎక్కి నిలబడ్డాడు..పవన్ లాంగ్ మార్చ్ చూసి జనసేన అభిమానులే అయోమయానికి గురయ్యారు. ఇక వైసీపీ నేతలతే ఇది లాంగ్ మార్చ్ కాదు కార్ మార్చ్ అని సెటైర్లు వేశారు. ఇక సొంత పుత్రుడు, దత్తపుత్రుడి ఇసుక డ్రామాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో బాబుగారే రంగంలోకి దిగబోతున్నారు. బాబోరు కూడా ఈ నెల 14 న విజయవాడలో ఇసుక దీక్ష దీక్ష చేయబోతున్నాడు. ఇవాళ గుంటూరు పార్టీ కార్యాలయంలో ఇసుక దీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. పవన్ చేసిన లాంగ్ మార్చ్తో ప్రభుత్వంపై వత్తిడి వచ్చిందంట..ఆ వత్తిడిని మరింత పెంచడానికి బాబోరు దీక్ష చేస్తారంట..ఇంతకీ బాబోరి దీక్ష ఎన్ని గంటలో తెలుసా..కేవలం 12 గంటలు..అంటే హాఫ్డే అన్నమాట..అంటే చినబాబు మాదిరిగానే బాబోరు కూడా పొద్దున్నేకడుపు నిండా తినేసి దీక్షా శిబిరంలో కూర్చుంటారన్నమాట. అయితే చినబాబులా నాలుగు గంటలే చేస్తాడా..లేకుంటే అంతకంటే ఎక్కువే చేస్తాడా..అన్న చర్చ టీడీపీలో జరుగుతుంది. చినబాబు అంటే తినకుండా ఉండలేడు..అందుకే నాలుగుగంటలకే లేచి వెళ్లిపోయాడు..అయితే పెదబాబు చంద్రబాబు మాత్రం చాలా గట్టోడు..ఈజీగా 9-10 గంటలు ఏమి తినకుండా ఉంటాడు..అంతకు ఆకలైతే మన సీఎం రమేష్ బాత్రూంలో బిర్యాని తిన్నట్లు బాబోరికి కూడా సీక్రెట్గా వండిద్దాం అంటూ తెలుగు తమ్ముళ్లు జోకులు వేసుకుంటున్నాకరు. మొత్తంగా వరుసగా సొంత పుత్రుడు, దత్తపుత్రుడి దీక్షల తర్వాత బాబుగారి దీక్ష మొదలెట్టడం చూస్తుంటే..ముగ్గురు కావాలనే కూడబలుక్కుని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతుంది. మొత్తంగా బాబుగారి ఇసుక దీక్ష మరెంత కామెడీ క్రియేట్ చేస్తుందో చూడాలి..!