తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. రుణం పద్దు కింద ఇచ్చిన విధులు వాస్తవానికి విరాళమేనని స్పష్టం చేశారు. GHMC ఆర్థిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి సాయం చేస్తుందని GHMC కమిషనర్ లోకేశ్ కుమార్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Tags finance secretary telangana rtc state government