Home / ANDHRAPRADESH / విశాఖలో బయటపడిన మరో భారీ భూకుంభకోణం..!

విశాఖలో బయటపడిన మరో భారీ భూకుంభకోణం..!

టీడీపీ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో విశాఖ భూకుంభకోణం ఒకటి. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2ల‌క్ష‌ల ఎఫ్.ఎం.బి స‌ర్వే నెంబ‌ర్ల‌లో 16,000 నెంబ‌ర్లు గ‌ల్లంత‌య్యాయి. దీనిలో సుమారు ల‌క్ష ఎక‌రాల భూమి అన్యాక్రాంతం అయిన‌ట్టు చ‌ర్చ జ‌రిగింది. కానీ ప్ర‌భుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎక‌రాలుగా మాత్ర‌మే చిత్రించే ప్ర‌య‌త్నం చేసారు. ఈ భూకుంభకోణంలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా, అమరావతి పెద్దల హస్తం ఉందని..నాడు సాక్షాత్తు కేబినెట్ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడే సంచలన ఆరోపణలు చేశారు. నాటి ప్రతిపక్షం విశాఖ భూకుంభకోణంపై రాజీలేని పోరాటం చేసింది. దీంతో బాబు సర్కార్ తూతూమంత్రంగా సిట్ విచారణ జరిపించి గంటాకు క్లీన్ చిట్ ఇప్పింది..కేసును పక్కనపడేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ కమీషన్..ప్రస్తుతం విశాఖ భూకుంభకోణంపై విచారణ జరుపుతోంది. కాగా తాజాగా విశాఖ జిల్లాలో మరో భారీ కుంభకోణం బయటపడింది. విశాఖ జిల్లాలోని అటవీ భూముల కబ్జాలకు గురయ్యాయి. దాదాపు 868.49 ఎకరాల అటవీ భూములను బడా నేతలు కబ్జా చేసినట్లు..ఈ మేరకు నకిలీ దస్తావేజులు క్రియేట్ చేసి, ప్రభుత్వ రికార్డులను కూడా ట్యాంపర్ చేశారని అధికారులు అంటున్నారు. అటవీ భూముల కుంభకోణంపై అటవీ శాఖ చాలా కాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతుంది. తాజాగా విశాఖ భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్‌ కమీషన్‌కు విశాఖ ఢీఎఫ్‌వో సెల్వం అటవీ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌పై ఫిర్యాదు చేశారు. అయితే రికార్డులు ట్యాంపర్ అయినా..భూములు మాత్రం ఇంకా అటవీ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ట్యాంపర్ అయిన అటవీ భూములలో ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమికి సంబంధించిన రికార్డులు ట్యాంపర్ అయ్యాయనే విషయాన్ని సెల్వం కమీషన్‌కు సవివరంగా తెలిపినట్లు సమాచారం. ఈ అటవీ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌పై జిల్లా, హైకోర్టులలో మొత్తం 14 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్ విచారణ జరుపుతున్న దరిమిలా..అటవీ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌పై డీఎఫ్‌వో సెల్వం సిట్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో దాదాపు 5 వేల కోట్ల విలువ గల అటవీ భూముల కుంభకోణం బయటపడింది. టీడీపీ నేతలే రికార్డులు ట్యాంపరింగ్ చేసి అటవీభూములను కొట్టేయాలని చూశారని విశాఖలో చర్చ జరుగుతోంది. మరి ఈ అటవీ భూముల కుంభకోణంలో టీడీపీ నేతల ప్రమేయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా 5 వేల కోట్ల విలువైప అటవీభూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసిన ఘటన విశాఖ అధికార, రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat