కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు.
ఆ తర్వాత 2003లో చట్టానికి కాస్త సవరణలు చేసి పదేండ్ల వ్యవధిని ఒక్క ఏడాదికి కుదించారు. అయితే తాజాగా శ్రీమతి సోనియా గాంధీ దగ్గర నుంచి అల్లుడు రాబర్ట్ వాద్రా వరకు అందరికీ ఉన్న ఎస్పీజీ భద్రతను తగ్గిస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ భద్రతను తగ్గించి జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం తెలిపింది. మోదీ సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుమంటున్నారు.